సలాది ఉదయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన సాయి శరత్
దెందులూరు నియోజకవర్గం, దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో జరిగిన హత్యోదంతంలో మృతి చెందిన సలాది ఉదయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి కార్యక్రమాలకు కావల్సిన ఆర్ధిక మొత్తాన్ని అందించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో మృత్యువాతపడడం చాలా బాధాకరమైన విషయమని చిన్న చిన్న విషయాలకు ఇంత దూరం తెచ్చుకోవడం సరికాదన్నారు. అలాగే యువత ఆవేశంలో ఏదైనా గొడవలకు పాల్పడినా ఇంట్లో మహిళలు సంయమనం పాటించి వారికి సర్దిచెప్పాలి కాని ఉద్రేకపడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-16.52.17.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-16.52.19.jpeg)