ఆత్మహత్యాయత్నం చేసిన రైతును పరామర్శించిన జనసేన నాయకులు
అనపర్తి నియోజకవర్గం, ఉన్నత అధికారుల ఎదుట పురుగుల మందు తాగి దమ్ము శివ అనే రైతు తన భూమిని అధికారులు లాక్కుంటున్నారనే ఆందోళనతో ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. వారిని పరామర్శించిన అనపర్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆర్ నాగు, రంగంపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు గిరజల సత్తిబాబు, నల్లమిల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కొండెపూడి శ్రీనివాస్, కొండెపూడి భాను, సుంకర బుజ్జి వారిని ఆసుపత్రిలో పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారికి జనసేన పార్టీని తరఫున అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-09-at-20.04.14-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-09-at-20.04.25-1024x768.jpeg)