మండలాధికారిని సన్మానించిన జనసేన నాయకులు

అమలాపురం మండల అధికారిగా పనిచేస్తున్న ఎం.ప్రభాకర్ రావుకి ప్రమోషన్ పై జిల్లా అధికారిగా కాకినాడకు ప్రమోషన్ మీద బదిలీ అవడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.ప్రభాకర్ రావుని అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి, సవరపాలెం జనసేన పార్టీ ఎంపిటిసి, ఇందుపల్లి జనసేన పార్టీ ఎంపీటీసీ, ఈదరపల్లి జనసేన పార్టీ సర్పంచ్ వీరందరి చేతులమీదుగా ప్రమోషన్ మీద వెళ్తున్న ఎం.ప్రభాకర్ రావు దంపతులను శలువ కప్పి, పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి బాబు, జడ్పిటిసి హరిబాబు, ఎండిఓ ప్రసాద్, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీరాజ్ డీయులు, వాలంటరీలు, ఎంఈఓ, ఇఆర్డిఓ, సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొని వీడ్కోలు పలికారు.