శ్రమదానం చేసిన యల్ యల్ పురం జనసేన

పాలకొండ నియోజకవర్గ పరిధిలో గల యల్ యల్ పురం గ్రామంలో ఎస్సి వీధిలో కాలువలు పరిశుభ్రత చెయ్యమని స్థానిక అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాయుకులు, అధికారులు లేకపోవడంతో విసుగుచెందిన ఇండియన్ ఆర్మీ ముంజు రాంబాబుతో పాటుగా జామి అనిల్ పాల్గొని కాలువలు శుభ్రం చెయ్యడం జరిగింది. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిలో కూడా పరిశుభ్రం చేసే విధంగా నాయుకులు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని, ఎందుకు అంటే గ్రామంలో పరిశుభ్రత లేకపోవడంతో అనేక రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని జనసేన పార్టీ తరుపునుంచి గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు ఎలాంటి పోరాటం అయినా చెయ్యడానికి గ్రామ జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియచేస్తున్నామని అన్నారు.