‘నా సేన కోసం నా వంతు’ కు అండగా ‘గల్ఫ్ సేన జనసేన’

సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్ దేశాల ఐక్య వేదిక ‘గల్ఫ్ సేన జనసేన’ పార్టీ ఆదేశాల మేరకు శనివారం నాడు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, కమిటీ కన్వీనర్ ఉదయ్ శ్రీనివాస్, కో కన్వీనర్ శ్రీమతి రుక్మిణీ, ఐటి విభాగం నుంచి సంజయ్ పసుపులేటి మరియు కమిటీ మెంబర్ రవి కుమార్ పాల్గొన్నారు. గల్ఫ్ సేన జన సేన నుంచి ఆరు దేశాల కో ఆర్డినేటర్లు మరియు కోర్ మెంబెర్స్ సుమారుగా 100 మంది ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నా సేన కోసం నా వంతు గల్ఫ్ లో ఉన్న జన సైనికులను అందరినీ కలుపుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలో స్పష్టమైన దిశ నిర్దేశం చేయడం జరిగింది. పార్టీ అధ్యక్షులు వారు పార్టీ కోసం కష్ట పడుతున్న ఎన్నారై లను గుర్తించి, త్వరలోనే ఎన్నారై కమిటీని ప్రకటిస్తారని ఆ కమిటీ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అందుకోసం అధ్యక్షుల వారు కసరత్తు చేస్తున్నట్లు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆరు గల్ఫ్ దేశాల నుంచి సుమారుగా అయిదు వేల మందిని నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాస్వామ్యులను చేస్తామని గల్ఫ్ సేనజన సేన సభ్యులు రాష్ట్ర కమిటీకి తెలియచేశారు. 5 వేల మందిని భాగస్వామ్యులను చేసే కార్యక్రమాన్ని గల్ఫ్ దేశాల్లో ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో సభ్యుల మధ్య చర్చ జరిగిన అనంతరం, కార్యాచరణ రూపొందించడం జరిగింది. నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యులు అందరూ, గత 4 సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయడంలో భాగస్వాములుగా ఉన్న గల్ఫ్ సేన జన సేన సభ్యులు అందరికీ పేరు పేరునా దన్యవాదములు తెలియచేసారు. రాజకీయాల్లో మార్పు కోసం, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం, నిత్యం ప్రజల పక్షాన నిరంతరం శ్రమిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీకి అండగా నిలబడాలని, పార్టీలో భాగస్వాములు అయ్యేందుకు విరాళాలు అందిద్దామని, మరింత బలంగా వ్యవస్థ మార్పు కోసం పోరాడుదాం అని గల్ఫ్ సేన జనసేన సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి, పార్టీకి అండగా నిలబడి విరాళాలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా గల్ఫ్ సేన జనసేన కృతజ్ఞతలు తెలియజేసారు.