విశాఖ తూర్పు నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

విశాఖ తూర్పు నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆదివారం కళాభారతి వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ఫైనాన్షియల్ కమిటీ మెంబర్ పీలా రామకృష్ణ, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వీరమహిళా కోఆర్డినేటర్ శ్రీమతి నాగలక్ష్మి, జనసేన పార్టీ జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరియు జనసేన పార్టీ నాయకులు భోగిల శ్రీనివాస పట్నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ద్వారా విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం ద్వారా అత్యధిక సభ్యులను చేర్చే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి విశాఖ తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.