ఆత్మకూరులో రెండవరోజు పవనన్న ప్రజాబాట

ఆత్మకూరు నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా రెండవ రోజున 1వ వార్డ్ డివిజన్ శాంతినగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పట్ల తమ వంతు పోరాటం చేస్తామని శాంతినగర్ ప్రజలకు భరోసా కల్పించారు. ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ డ్రైనేజీ మరియు మంచి నీళ్ళు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజల సమస్యలన్నీ తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నదని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దాడి భాను కిరణ్, సురేంద్ర, వంశీ, చంద్ర, సురేష్, అనిల్ రాయల్, నాగరాజా తదితరులు పాల్గొన్నారు.