చంద్రగిరి మండలంలో ‘నాసేన కోసం – నా వంతు’

చంద్రగిరి, పిఏసి సభ్యులు, జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలమేరకు జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ సూచనలతో చంద్రగిరి మండలంలో స్థానిక మండల నాయకుల ఆహ్వానం మేరకు యువరాజ్ అద్వర్యంలో ‘నాసేన కోసం – నా వంతు’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జనసైనికులు, నాయకులు, మెగాఅభిమానులు, జనసేన సానుభూతిపరులు, జనసేన మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క సైనికుడు జనసేనపార్టీ నాసేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగస్వాములై తమవంతు ఆర్థికసహాయం చెయ్యాలని పార్టీని ఆర్థికంగా బలపరచాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, మంజుల వాణి, ఆశ, కుసుమ, ఐతేపల్లి సాయి, రాకేష్, లోకేష్, నాగదిలీప్, బాషా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.