నిడదవోలులో ఘనంగా జనంలోకి – జనసేన

నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేనపార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకట రత్నం ఆధ్వర్యంలో రావిమెట్ల గ్రామంలో ఘనంగా చేపట్టిన జనంలోకి – జనసేన కార్యక్రమానికి అడగడుగున హారతులతో మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకట రత్నం కి స్వాగతం పలికిన రావిమెట్ల ఆడపడుచులు. జనసేన అధినేత ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పవనన్న ప్రజాబాటలో ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుండి నడిపించిన రావిమెట్ల గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో నిడదవోలు వీరమహిళ బెల్లంకొండ పుష్పవతి, వాకా ఇంద్ర గౌడ్, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు యామన కాశీ, మూర్తి మరియు రావిమెట్ల గ్రామ పార్టీ అధ్యక్షులు వరద సత్యనారాయణ, వరద వీరార్రజు, జెట్టి శ్రీను, గన్నబత్తుల సురేష్, నాయుడు సుబ్రమణ్యం, కొల్లంశెట్టి గోపి, వినయ్, పోతుల చింటు, పెరుమల్ల శ్రీను, మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.