శృంగవరపుకోటలో జనంకోసం జనసేన
- జనంకోసం జనసేన కార్యక్రమంలో ప్రజల వద్దకు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు వబ్బిన సత్యనారాయణ( సత్తిబాబు)
శృంగవరపుకోట, వేపాడ మండలంలోని గ్రామాలు ఆకుల సీతంపేట, కొంపిల్లి(కుమ్మపల్లి), మరియు లక్కవరపు కోట మండలం కల్లెపల్లి రేగ లోని ప్రజల వద్దకు చేరుకుని జనసేన పార్టీ మేనిఫెస్టో, షణ్ముఖ వ్యూహం, గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసే బాధ్యత కుటుంబం మొత్తం తీసుకోవాలని తెలియజేస్తూ కరపత్రాలు పంచడం జరిగింది. ఆయాగ్రామాల్లో పలుచోట్ల వినాయక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని తదుపరి గా జనసేన పార్టీ యువతకు టీ షర్ట్ లు పంచడం జరిగింది. ఆ గ్రామాల్లో జనసైనికులు మాట్లాడుతూ మా ఇంట్లో కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు చేస్తున్న సహాయం గురించి వివరించి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లు వేయించే బాధ్యత తీసుకుంటామని తెలీయజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-22.24.01-2-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-22.24.01-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-22.24.01-1-1024x766.jpeg)