నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

  • జనసేనపార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్

గురజాల, ప్రతి ఒక్క జనసైనికుడిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రూపొందించిన నా సేన కోసం నా వంతు క్రౌడ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మరికొంత సమయాన్ని అక్టోబర్ 2 వరకు పొడిగించడం జరిగిందని తెలియజేశారు. త్వరలో పిడుగురాళ్ల మండల పరిధిలోని ప్రతి గ్రామంలో కూడా పర్యటించి ప్రజలకు ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం, అదేవిధంగా ఎక్కువ మందిని, భాగస్వామ్యం చేసే విధంగా, గ్రామ మరియు మండల స్థాయిలో కార్యక్రమాలు రూపొందిస్తామని తెలియజేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం విశేష ప్రజా ఆదరణ పొంది, రాష్ట్రంలో అనేకమంది ప్రజలు స్వచ్ఛందంగా నా సేన కోసం నేను సైతం అంటూ పార్టీకి విరాళాలు అందిచారని, తెలియజేశారు, అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా… జనసేన పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలియజేశారు.