వెబ్ సిరీస్ తో సందీప్

ఓవర్ నైట్ లో క్రేజ్ అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మళ్ళీ తెలుగులోనే మరో సినిమా చేస్తాడని అందరూ ఎదురుచూస్తుండగా… బాలీవుడ్ లో హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. హిందీలో అర్జున్ రెడ్డి కి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ భారీ వసూళ్లు సాదించడంతో సందీప్ రెడ్డి పేరు ఒక్కసారిగా మరో రేంజ్ కి వెళ్లింది. అసలు విషయం ఏమిటి అంటే.. మళ్ళి మరో బాలీవుడ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూసిన సందీప్ కరోనా కారణంగా ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు కాబట్టి సినిమాల కంటే వెబ్ కంటెంట్ తో క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఒక స్టార్ హీరోయిన్ తో అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సంస్థతో కలిసి వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ లో కొన్ని స్టోరీలను రాసుకున్న సందీప్ వెబ్ కంటెంట్ ని కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఆ ప్రాజెక్టును కరోనా తీవ్రత తగ్గిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి తన శిష్యులతో కూడా విబిన్న తరహా చిత్రాలను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బోల్డ్ డైరెక్టర్ చిత్రీకరించే వెబ్ సిరీస్ చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిoదే.