“మహాపాదయాత్రకు జనం నీరాజనం”
- జనంకోసం జనసేన – మహాపాదయాత్ర 26వ రోజు
రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో జనంకోసం జనసేన – మహాపాదయాత్ర 26వ రోజులో భాగంగా గ్రామంలో కార్యక్రమానికి ప్రజల జననీరాజనంతో ముందుకు సాగింది. జనసేన నాయకురాలు మరియు జనసేన నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన ఈ వైసీపీ సర్కాన్ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని, దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన విధానాలు ముద్రించిన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైలపూడి శ్రీను, సిరిపరపు రాంబాబు, శివ, చవితిన కిరణ్, చొక్కాకుల నారాయణ, పొదలపు రవీంద్ర, గడి దుర్గా ప్రసాద్, గడి అప్పన్న, గడి వినోద్, బోల్లం శివ, ముత్యాల హరీష్, తోట సూర్య మణికంఠ, బడిరెడ్డి దుర్గా ప్రసాద్, హేమ మణికంఠ, వీర మహిళలు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-17-at-16.14.26-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-17-at-16.14.28-1024x576.jpeg)