‘నా సేన కోసం నా వంతు’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పి.ఎ.సి సబ్యులు పితాని బాలకృష్ణ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుండి ప్రతిఒక్కరు తమవంతు బాధ్యతగా అందరిని కలుపుకుంటూ జనసేన పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చెయ్యాలని దీనికోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జనసేన పార్టీ కొరకు స్వచ్ఛంద విరాళాలు అందించే కార్యక్రమంలో బాగంగా నాసేన కోసం నావంతు కార్యక్రమాన్ని రాష్ట్ర పి.ఎ.సి సభ్యులు కొణిదల నాగబాబు ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా ప్రతీక్షణం ప్రజాశ్రేయస్సు కొరకు నిలబడి ప్రజలపక్షాన పోరాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై 7288040505 కి విరాళాలు అందచేసి పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడాలని పితాని బాలకృష్ణ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, గోదశి పుండరీష్, సానబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి బాలకృష్ణ, గిడ్డి రత్నశ్రీ, యలమంచిలి బాలరాజు, తాళ్లూరి ప్రసాద్ గోలకోటి వెంకన్నబాబు, రాయపురెడ్డి బాబీ, పాటి శ్రీను, కొప్పిశెట్టి గణేష్, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, భీమాల సూర్యనాయుడు, నాతి నాగేశ్వరరావు నూకలదుర్గ, మచ్చా నాగబాబు, కడలి వెంకటేశ్వరావు, విత్తనాల అర్జున్, మద్దింశెట్టి పురుషోత్తం, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, వైదది దశరద్, పోలిశెట్టి కుమార్, ఎంపీటీసీ జమి, దూడల స్వామి జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.