దాచేపల్లి లో అక్రమ క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి: అంబటి మల్లి
- జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అంబటి మల్లి.
దాచేపల్లి మండలం నగర పంచాయతీ పరిధిలోనీ నదికుడి వద్ద ప్రమాదవశాత్తు క్వారీ గుంత లో పడి 11ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దురదృష్టకరం.
చిన్నారుల జీవితాల్ని చిదిమెస్తున్న క్వారీ లీజులను నిలిపివేయాలి.
ఎంతమంది చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంటే మొద్దు నిద్ర పోతున్న మైనింగ్ శాఖ అధికారులు కళ్ళు తెరుస్తారు.
మైనింగ్ నిబంధనలను పాటించని క్వారీలపై వెంటనే చర్యలు చేపట్టాలి.
దాచేపల్లి క్వారీల తవ్వకాలతో అక్రమార్కులు కోట్లు గడిస్తుంటే అభం శుభం తెలియని కొన్ని కుటుంబాలకు కంఠశోష మిగులుతుంది.
శ్రీనివాసపురం ఘటన జరిగినప్పుడు క్వారీయింగ్ జరుగుతున్న ప్రతి చోటా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అప్పటి మైనింగ్ అధికారులు ఇచ్చిన హామీ నీటి మీద బుడగ చందంగా మిగిలిపోయింది.
శ్రీనివాసపురం ఘటన తర్వాత చర్యలు తీసుకున్నట్లయితే ఈరోజు అభం శుభం తెలియని బాలుడి తల్లిదండ్రులకు కడుపు కోత కలిగేది కాదు.
జరిగిన ఘటనకు మైనింగ్ శాఖ అధికారులు, క్వారీ యజమానులు బాధ్యత వహించాలి.
జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
బాధిత బాలుడి కుటుంబ సభ్యులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలి.
బాధిత బాలుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అంబటి మల్లి మీడియా ముఖంగా తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/malli-1024x576.jpg)