జనసైనికుని కుటుంబానికి అండగా జనసేన పార్టీ..
పోలాకి మండలం కొత్తరేవు గ్రామంకి చెందిన వారధి రాంబాబు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న నరసన్నపేట నియోజకవర్గ జనసేన నాయకులు బలగ ప్రవీణ్ కుమార్, జనసైనికులు మరియు కోవిరిపేట యూత్ కలిసి 27 వేల రూపాయలు నగదు మరియు నిత్య అవసర సరుకులని వారధి రాంబాబు తల్లి లక్ష్మి కుటుంబానికి అందించటం జరిగింది.. ఈ సందర్భంగా బలగ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆమెకు పార్టీ తరుపున అన్ని విధాలుగా అండగా జనసేన పార్టీ మరియు మేము ఉంటాము.. అని భరోసా ఇవ్వటం జరిగింది.. ఈ కార్యక్రమం నరసన్నపేట జనసేన కార్యకర్తలు అంబటి కొర్లయ్య, అర్జాల కళింగ రాజు, లాండ రమేష్, బి.బుజ్జి, కొండ శశిధర్, చీకటి మన్మధ, చొక్కర రమేష్, తనకాల శంకర్, జల్లు సూర్య, మిన్నరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.