క్రౌడ్ ఫండింగ్ అవగాహనా సదస్సు
“నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి సూచనల మేరకు నేడు ఆమదాలవలస జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహనరావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా క్రౌడ్ ఫండింగ్ గురించి ప్రజలకు వివరిస్తూ వారికి మరింత చేరువ కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/sada-1024x576.jpg)