స్థానిక సమస్యలపై ఎన్.టి.టి.పి.ఎస్ సిఈ ని కలిసి వినతిపత్రం అందచేసిన జనసేన

మైలవరం, కొండపల్లి మున్సిపాలిటీ మరియు ఇబ్రహీంపట్నం మండల పరిసరప్రాంతాల కాలుష్య సమస్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై డా.ఎన్టీటీపీఎస్ బాధ్యతను గుర్తుచేస్తూ మున్సిపాలిటీ మరియు మండలానికి రావాల్సిన సిఎస్సార్ గ్రాంట్స్ విడుదల కొరకు, తుమ్మలపాలెంలో కాలువపై నిర్మించాల్సిన వంతెన కొరకు, బూడిద అక్రమ రవాణాని అరికట్టాలని, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, గ్రామాల్లో విధిగా మొక్కల పెంపకం మరియు వైద్య శిబిరాలు నిర్వహించాలని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల గాంధీ ఆధ్వర్యంలో డా.ఎన్టీటీపీఎస్ సిఈ అశోక్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీమతి చింతల లక్ష్మీ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, సామల సుజాత, సామల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.