పోస్టల్‌ బ్యాలెట్‌లో ముందంజలో టీఆర్‌ఎస్‌

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదట 1453 పోస్టల్ బ్యాలెట్‌, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ముందంజలో ఉంది. ఈ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలను తెరిచింది. కొద్దిసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈవీఎంల మొదటి రౌండ్ లెక్కింపు షురూ అయ్యింది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. మరోవైపు.. సిద్దిపేట శివారులోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాల బయటి నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితిని చూసుకుంటూ వెళ్లారు. కౌంటింగ్ కేంద్రం బయట టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.