పార్వతీపురం నియోజకవర్గంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం

పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండల పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్వతీపురం నియోజకవర్గ నాయకులు మరియు జన సైనికులు సమావేశమై నా సేనా కోసం నావంతు కార్యక్రమం నిర్వహించి, తమ విరాళాలను ఫోన్ పే ద్వారా కేంద్ర పార్టీ కార్యాలయం ఆఫిసిఅల్ అకౌంట్ కి పమపడం జరిగింది.. అలాగే పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జనసేన నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలకు ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది.. మీకు తోచినంత విరాళం ఇచ్చి, పార్టీ చేసే మంచి కార్యక్రమాలలో మీరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజక వర్గ నాయకులు కాతా విశ్వేశ్వర్ రావు, అల్లు రమేష్, చిట్లు గణేష్, కర్రి మణికంఠ, జై శంకర్ మరియు జన సైనికులు ధనంజయ కిషోర్, రాజు, భాస్కర్, బర్ల వెంకటరమణ, పవన్, బొత్స ఆనంద్, కర్రి పద్మారావు, సాయి తరుణ్, దుర్గ ప్రసాద్, శివ, చంద్ర శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.