బత్తుల దంపతుల ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు కార్యక్రమం”

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి లకు పల్లకడియం ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజాక్షేమం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపే కార్యక్రమమే నా సేన నావంతు కార్యక్రమమని బత్తుల జనసైనికులకి వివరించారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రజలకోసం పాటుపడుతున్న పార్టీ జనసేన అని ఘంటాపథంగా తెలియజేసారు. చదువుకున్న యువత, విజ్ఞులు రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీకీ మద్దతుగా నిలవాలని తెలియజేసారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్కార్యాన్ని తలపెట్టిన పవన్ కళ్యాణ్ కి మన వంతుగా సహకారం అందించే మార్గమే ఈ నాసేన నావంతు కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న పార్టీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, జనసైనికులకి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో చూపించినందుకు పల్లకడియం జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.