మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల దంపతులు

  • విత్తనాల ధర్మరాజు కుటుంబానికి 10,000/- ఆర్ధికసాయం

రాజనగరం, రాజనగరం మండలం, పల్లకడియం గ్రామానికి చెందిన విత్తనాల ధర్మరాజు తాత్కాలిక లైన్మెన్ గా పనిచేస్తూ కరెంట్ షాకుతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి పరామర్శించి, ధైర్యం చెప్పి, భవిష్యత్తులో వారి చిన్న పిల్లల చదువులకు అన్ని విధాల సహకరిస్తామని భరోసా ఇచ్చి 10,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

  • సన్నపు యోహాను కుటుంబానికి 10,000/- ఆర్ధికసాయం

రాజనగరం మండలం, పల్లకడియం గ్రామానికి చెందిన దళిత నాయకులు సన్నపు యోహాను గుండెపోటుతో మృతి చెందగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 10,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం చేసి, భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తూర్పుగోనుగూడెం సర్పంచ్ గళ్ళ రంగా, చిట్టిప్రోలు సత్తిబాబు, కానవరం రామకృష్ణ, ముఖ్య నాయకులు పల్లకడియం జనసేన పార్టీ అధ్యక్షులు వేమవరపు వెంకటేశ్వర్లు, వేమవరపు సుబ్రహ్మణ్యం, బొర్రా చిన్ని బాబు, గెడ్డం శ్రీను, రొక్కల సుబ్బారావు, వి.సుబ్రహ్మణ్యం, రొక్కాల కిట్టయ్య, కస్తూరి బద్రి, బుర్ర గోపాలం, వేమవరపు యేసు, విజ్ఞ చంటి, వేమవరపు సుబ్రహ్మణ్యం, వెంకి శ్రీను, విజ్ఞ అబ్బాస్, వి.శ్రీను, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.