అంబకండి గ్రామంలో పర్యటించిన ఎన్ని రాజు

  • కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామి

రాజాం నియోజకవర్గం, రేగడి మండలం అంబకండి గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉందని తెలుసుకొని రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజు ఆ గ్రామానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం గ్రామంలో త్రాగునీరు కలుషితమవుతుందని, తద్వారా చాలామందికి కిడ్నీ వ్యాధి వస్తుందని ఆ గ్రామంలో డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తులు ఐదుగురు, అలాగే మందులు వాడుతున్న వ్యాధిగ్రస్తులు 30 మంది వరకు ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎన్ని రాజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ని రాజుతో పాటు రేగిడి మండల జనసైనికులు పాల్గొనడం జరిగింది.