రోడ్ల సమస్యపై ఆర్డీవో కు జనసేన వినతిపత్రం

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ – రాజాం రోడ్ చాలా అద్వానంగా ఉందని, ఈ రోడ్డులో తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గత రెండు రోజులో ఎక్కువగా జరిగాయని ప్రాణహాని జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది. ఈ విషయంపై ఆర్ డి ఓ హేమలత సానుకూలంగా స్పందిస్తూ త్వరితంగా దీన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టి ఈ సమస్యను సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీ నాయకులు పోరెడ్డి ప్రశాంత్, జనసేన జానీ, పొట్నూరు రమేష్, షేక్ అజాద్, జామి అనిల్, వారాడ సతీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.