సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో మహాత్మునికి ఘననివాళి

సర్వేపల్లి, వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మహాత్మాగాంధీ జయంతి వేడుకను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతి మార్గంతో చేతిలో ఆయుధం లేకుండా ఆయన ఒక్క అడుగుతో కొన్ని కోట్ల మందిని నడిపించి బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి భారతీయులని విముక్తులను చేసి స్వరాజ్యమైన జన్మహక్కు అనే నినాదంతో ఆ మహనీయుని బాటలో ప్రతి ఒక్కరు నిలవాలని, పల్లెలను అభివృద్ధి చేయాలని, సామాన్యులకు న్యాయం జరగాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇవన్నీ కొనసాగాలంటే జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రహీం, సందీప్, శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.