పాశం నాగబాబు ఆధ్వర్యంలో జాతిపితకు ఘననివాళులు

నూజివీడు, మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని నూజివీడు జనసేన పార్టీ అధ్వర్యంలో ముసునూరు మండలం, రమణక్కపేటలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ అహింసా పరమో ధర్మః అంటూ బ్రిటీష్ వారిని తరిమికొట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతిపిత మహాత్మాగాంధీ అని రేపు జనసేన పార్టీ అధికారంలోకి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పథకాలకు జాతి నాయకుల పేర్లు పెట్టి స్మరించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, మండల కార్యవర్గ సభ్యులు వేట త్రినాధ్, చేకూరి అనిల్, సాయి, సూర్య, నల్లగోపు వెంకటేశ్వరరావు, ఉప్పే నరేంద్ర, గుండబత్తుల శివ, పవన్ జనసైనికులు పాల్గొన్నారు.