రామాస్వామి పేటలో ‘నా సేన కోసం నా వంతు’

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం రామాస్వామి పేట గ్రామంలో ఏర్పాటు చేసిన నాసేన కోసం నావంతు కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకురాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి రామాస్వామి పేట ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజాక్షేమం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపే కార్యక్రమమే నా సేన కోసం నావంతు కార్యక్రమం బత్తుల వెంకటలక్ష్మి జనసైనికులకి వివరించారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రజలకోసం పాటుపడుతున్న పార్టీ జనసేన అని ఘంటాపథంగా తెలియజేసారు. చదువుకున్న యువత, విజ్ఞులు రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీకీ మద్దతుగా నిలవాలని తెలియజేసారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్కార్యాన్ని తలపెట్టిన పవన్ కళ్యాణ్ కి మన వంతుగా సహకారం అందించే మార్గమే ఈ నాసేన కోసం నా వంతు కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న పార్టీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని. జనసైనికులకి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో చూపించినందుకు రామస్వామి పేట జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగా, నాతిపాము దొర, గంగిశెట్టి రాజేంద్ర, వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాస్, ఇవ్వకల చిట్టిబాబు, మంచాల శ్రీను, చాట్ల వెంకటేష్, పెద్దిరెడ్డి శ్రీను తదితర నాయకులతో పాటు రామస్వామి పేట జనసైనికులు పాల్గొన్నారు.