గిరిజన ప్రాంతాల్లో జనసేన జెండాను ఎగురవేస్తాం

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం, నారాయణగూడా మరియు చుట్టుపక్కల గూడాల గ్రామములో ఆదివారం గ్రామ యువతకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను వివరించడం జరిగింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో పడుతున్న ఇబ్బందులలో ముఖ్యమైనవి నీటి సమస్య త్రాగునీటి కోసం చాలా అవస్థలు పడుతున్నామని అదే విధంగా సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వళ్ళ తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సారి మా గిరిజన ప్రాంతాల్లో జనసేన జెండాను ఎగరవేస్తామని ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. వారికి భరోసాగా పార్టీ నుంచి మేము అండగా ఉంటామని పాలకొండ జనసేన పార్టీ నాయకులు మరియు సీతంపేట మండల నాయుకులు శ్రీకాంత్, విశ్వనాధం, గణేష్, సింహాద్రి, వెంకట్రావు, రాజేష్, జనార్దన్, చంద్రావు, దుర్గారావు, భాస్కర్ రావు, వెంకట్రావు, మాధవరావు గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.