గాంధీజీ ఆశయాలను సాధిస్తాం

  • ప్రపంచ శాంతి నిర్దేశకుడు మహత్ముడూ

గురజాల, దాచేపల్లి మండలం, జనసేనపార్టీ మండల కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అంబటి మల్లి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని, అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి బ్రిటీష్ పాలకుల గుండెల్లో సింహ స్వప్నమై నిలిచాడని కొనియాడారు. నేటి ఆధునిక కాలంలో ఆయన అవలంబించిన ఆహింసా మార్గం ప్రపంచ శాంతికి తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ వేల్పుల చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు మండపాటి దుర్గారావు, ఉపాధ్యక్షులు సోము అంకారావు, కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి, తక్కెళ్ళపాడు సర్పంచ్ శానం వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కోటా మధు, పాముల కిషోర్, బొజ్జ ఆదినారాయణ, కార్యదర్శి జక్కా సుబ్బయ్య, జానయ్య తదితరులు పాల్గొన్నారు.