జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా గవర్నర్‌తో భేటి

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సతీ సమేతంగా రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తో భేటి భేటీ అయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్న ఆయన.. అరగంటకు పైగా భేటీ అయ్యారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను కూలంకషంగా గవర్నర్ కు వివరించారు ముఖ్యమంత్రి జగన్.