మహాత్మునికి నివాళులు అర్పించి ‘నా సేన కోసం నావంతు’ ప్రారంభించిన కుప్పం జనసేన
కుప్పం, గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం శాంతిపురం జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మునికి నివాళులర్పించడం జరిగింది. తదనంతరం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డా.మద్దినేని వెంకట రమణ పర్యవేక్షణలో శాంతిపురం మండల అధ్యక్షుడు కిషోర్ అధ్యక్షతన ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శాంతిపురం మండల పరిధిలో ‘నా సేన కోసం నావంతు’ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, సమన్వయకర్త అరుణ్, మండల కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, రవి, సురేష్, కె వి ప్రసాద్, కిరణ్, సంపత్, మణి మొదలగు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-16.01.45-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-16.01.46-1024x461.jpeg)