జనంకోసం జనసేన 311వ రోజు

  • వనరక్షణలో భాగంగా 800 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 311వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర గోకవరం మండలం గోపాలపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 800 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 72595 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు (శ్రీను), గోపాలపురం గ్రామం నుండి వీరవల్లి శ్రీనుబాబు, చింతల సుబ్బారావు(కాపు), వరుపుల నాగు, నాగ సురేష్, గూడవల్లి సతీష్, మణికంఠ, ముప్పిడి పూర్ణ వెంకటేష్, తుపాకుల వెంకటరమణ, గోనేడ నుండి వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోపాలపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన చింతల పండు గారి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు.