పేరారపు వీరబాబును పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, సంపత్ నగర్ వాస్తవ్యులు పేరారపు వీరబాబు పెరాలసిస్ కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం సంపత్ నగర్ ఎంపిటిసి సదానంద కిషోర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆయన సతీమణి జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మిని రాజమహేంద్రవరంలోని రమేష్ హాస్పిటల్ కి పంపించి వీరబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారి కుటుంబానికి ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంపత్ నగర్ ఎంపిటిసి సదానంద కిషోర్, మణికంఠ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.