దసరా ఉత్సవాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం పెద్దమడి గ్రామంలో మరియు ముమ్మిడివరం మండలం తానేలంక దేవి సెంటర్లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నసమారాధన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపర్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి పండు, రాయపరెడ్డి బాబి మండల ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, కడలి కొండ, వాసంశెట్టి బాబ్జి, గంజా శీను, పాటి శ్రీను, దేవి రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.