కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ గ్రామం ఎస్సీ పేట నందు పలివెల్ల జీవరత్నం కొద్ది రోజులు ముందే అకాలమరణం పొందడం జరిగింది. కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న స్థానిక జనసైనికులు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లాని కలిసి ఆ కుటుంబం యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ శ్రీధర్ పిల్లా వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ అవసరాల నిమిత్తం 25 కేజీల బియ్యం మరియు నగదును అందించడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ పిల్లా మాట్లాడుతూ జనసేన కుటుంబం మీకు అండగా ఉంటుందని మీకు వైద్య పరంగా గాని విద్య పరంగా గాని కుటుంబ పరంగా గాని ఏ ఇబ్బందిలో ఉన్న నాకు తెలియపరచండి నేను మీకు ఒక అన్నలా సాయం చేస్తానని డాక్టర్ శ్రీధర్ పిల్లా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా పలివెల నాని బాబు, కే రాజు, ఆకుల లావరాజు, రవి, జాన్సన్, సింగిల్ మళ్లీ, సురేష్, రవి, పెద్ద, జనసైనికులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.