కుప్పంలో నా సేన కోసం నావంతు
కుప్పం నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డా. మద్దినేని వెంకట రమణ పర్యవేక్షణలో శనివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రాళ్లబూదుగూరు పరిసర ప్రాంతాలలో నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గం జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి వామనమూర్తి, కుప్పం నియోజకవర్గ ఐటి వింగ్ కోఆర్డినేటర్ మధు, మండల కార్యవర్గ సభ్యులు సంపత్ మరియు జనసైనికులు పాల్గొనడం జరుగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-08-at-19.34.47-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-08-at-19.34.47-1-461x1024.jpeg)