చింతలపూడి నుండి ద్వారకాతిరుమల వరకు ఛలో మహా పాదయాత్ర

చింతలపూడి, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో జనసేనను గెలిపించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాలి అనే ఆశయంతో చింతలపూడి నుండి ద్వారకాతిరుమల ఆ ఏడుకొండల స్వామి వద్దకు పాదయాత్రను చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో చింతలపూడి నుండి భారీ జనసమూహంతో పాదయాత్రను శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.