రాజమండ్రి సిటీ జనసేనలో చేరికలు

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 24వ వార్డులో జిల్లా కార్యదర్శి వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో మంచాల సునీల్ వారి బృందం మరియు స్వర్ణకారుల బృందం భారీ సంఖ్యలో జనసేన పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, రాజమండ్రి సిటీ సభ్యులు, జనసేన నాయకులు, జనసేన మహిళా నాయకురాలు కళ్యాణి పాల్గొన్నారు.