స్పందనలో కలెక్టరుకు వినతిపత్రమిచ్చిన జనసేన నాయకులు

విజయవాడ, రాజరాజేశ్వరి పేట ఇళ్ల పట్టాల సమస్యపై కలెక్టర్ ఢిల్లీ రావుని స్పందన ప్రభుత్వ కార్యక్రమంలో కలిసి వినతిపత్రం సమర్పించిన జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, ఆర్ఆర్ పేట ఇళ్ళ పట్టాల బాధిత సంఘం అధ్యక్షులు జాఫర్ సాదిక్, 56 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పిల్లా వంశీ మరియు జనసేన పార్టీ నాయకురాలు షేక్ షాహీన. ఈ సందర్భంగా కలెక్టర్ తో మహేష్ మరియు జాఫర్ సాదిక్ మాట్లాడుతూ ఆర్ఆర్ పేట వాసులపై రైల్వే అధికారులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, రైల్వే శాఖకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అందుకు కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ప్రత్యేకంగా ఈ సమస్యపై దృష్టి సారించి న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగింది.