జివిఎంసి కమిషనర్ రాజబాబుని కలిసిన జనసేన నాయకులు

పెందుర్తి, జివిఎంసి కమిషనర్ రాజబాబుని కలిసి పెందుర్తి నియోజకవర్గంలోని చిన్నముసిడివాడ కూడలి నుండి శారదా పీఠం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణలో అధికార అలసత్వం మరియు దుర్వినియోగం జరుగుతుందని దానిపై తగు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మరియు 95, 96, 97 వ వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలు రోజువారి జీవితంలో తీవ్రమైన ఇక్కట్లకు గురవుతున్నారు అన్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. అంతేకాక త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ కమిషనర్ అభ్యర్థించి, వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివ శంకర్ మరియు డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, పెందుర్తి నియోజకవర్గ నాయకులు శానాపతి సోమశేఖర్ పాల్గొన్నారు.