నాగబాబును కలిసిన రాజంపేట జనసేన నాయకులు
- 2 లక్షల రూపాయల చెక్కు అందజేత
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబును హైదరాబాదు జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట నియోజకవర్గ పలు సమస్యలు పార్టీ స్థితి గతుల గురించి ఆయనకు వివరించారు. అనంతరం జనసేన పార్టీకి రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ రూ.2 లక్షల చెక్కును తమ పార్టీ నేతల ద్వారా నాగబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన యువ నాయకురాలు పోలిశెట్టి రజిత, భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, చంగల్ రాయుడు, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, సుండుపల్లె నుండి జనసేన వీరమహిళ రెడ్డిరాణి, వీరబల్లి నుండి గుగ్గిళ్ళ నాగార్జున, నందలూరు నుండి ప్రశాంత్ భారతాల, కోడూరునుండి అనంత రాయలు, ఏనుగుల శివ, మణిలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-11-at-15.48.41.jpeg)