వైసీపీ మంత్రులు చౌకబారు విమర్శలు మానుకోవాలి: అవనిగడ్డ జనసైనికులు

అవనిగడ్డ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొల్లు కబుర్లతో వ్యక్తిగత దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఇంకా ఎంత కాలం అంటారు, మీకు బోరు అనిపించడం లేదా, ఏ ప్యాకేజ్ తీసుకుని పర్యాటక శాఖ మంత్రి రోజా టిడిపి నుండి వైసీపీలోకి వచ్చారు, టిడిపిలో ఉండగా జగన్ మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా తిట్టారో ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా, టిడిపిలో ఉండగా జగన్ మోహన్ రెడ్డిని రాక్షసుడుతో పోల్చిన విడదల రజని ఏ ప్యాకేజ్ తీసుకుని వైసీపీలోకి వచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ బిల్లులు రావటం లేదు, ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 6 కోట్లకు పైగా అమౌంట్ పెండింగ్ లో ఉంది, ఎన్.టి.ఆర్ హౌసింగ్ స్కీం బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి, వీటి గురించి ఆలోచించకుండా మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ లలో కూడా కక్కుర్తి పడి చిన్న సైజ్ లో తయారు చేసిన కాంట్రాక్టర్ ల మీద చర్యలు తీసుకోకుండా, మీ శాఖలో జరిగే విషయాల గురించి పట్టించుకోని బొత్స సత్యనారాయణ అనే మీరు… పవన్ కళ్యాణ్ ని విమర్శించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మీ జగన్ మోహన్ రెడ్డి అమరావతిని రాజధాని గా అంగీకరించిన మాట వాస్తవమా, కాదా..? రోజుకొక మాట మార్చే మీ ముఖ్యమంత్రి, మీరు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారంటే ఎలా నవ్వాలో ప్రజలకు అర్దం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపిటిసి బొప్పన భాను, జనసైనికులు బచ్చు శ్రీహరి, రాజనాల వీరబాబు, కోసూరి అవినాష్, బొప్పన పృథ్వి, గుగ్గిలం అనీల్, రోహిత్ నాయుడు, అప్పీకట్ల శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.