పవన్ కళ్యాణ్ పై విమర్శించిన మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కలప రవి చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షుడు దూతి జస్వంత్ ఎర్రవారిపాలెం మండల అధ్యక్షుడు ముండ్లపాటి మురళి మరియు కార్యకర్తలు నాయకులు స్థానిక జనసేన పార్టీ కాత్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సదరు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్లకు మన మంత్రులు సరైన సమాధానం చెప్పలేక అడ్డదిడ్డంగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా జనసేన నాయకులు ఖండించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన శాఖలకు వారు న్యాయం జరిగే విధంగా చేయలేక ఇలా జనసైనికులు జనసేన నాయకులపై పడటం ఇది చేతకానితనం ఇలానే మీరు మీ ప్రవర్తన మార్చుకోకపోతే 2024లో ప్రజలు మీకు తగిన గుణపాఠం నేర్పుతారు జనసైనికుల కోపానికి గురవుతారు కనీసం మన జబర్దస్త్ రోజా సొంత ఊరైన భాకరాపేటలో బస్టాండ్ కూడా దయనీయ పరిస్థితి అలానే తలకోన పర్యాటక ప్రాంతం రోజా సొంత ప్రాంతం కోనేరు కూడా లేని పరిస్థితి, ఇవన్నీ గమనించి మీ మీ శాఖలకు న్యాయం చేసి తరువాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయండి మా మాటిమాటికి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటున్నారని మీరు అంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ ఇచ్చే అంత మగాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అని జనసేన నాయకులు ప్రశ్నించారు. మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉండేది మీరు నిరూపించండి లేకపోతే తప్పుడు వ్యాఖ్యలను మానుకోండి.