జనసేనానికి ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చిన గెడ్డం బుజ్జి మరియు బోడపాటి శివదత్

పాయకరావుపేట, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఈ నెల 15, 16, 17 తేదీలలో ఖరారైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 15 వ తేదీన ఉదయం 10.30 కి వైజాగ్ విమానాశ్రయం వద్ద జనసేనానికి ఘనస్వాగతం పలకడానికి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి సుమారు 5000 మంది జనసైనికులు హాజరవ్వాలని నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం బుజ్జి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్యటనను వైఎస్సార్సీపీ పార్టీ ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది కనుక, ఎన్ని అడ్డంకులు వచ్చినా 15 వ తేదీన ఉదయం 10 గంటలకి వైజాగ్ విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకోవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన సత్తా ఏంటో ప్రత్యర్థులకు చూపించాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు.