పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మర్రాపు సురేష్

గజపతినగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్వాగతం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నెల 15, 16, 17 వ తేదీలలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా 15 వ తేదీన వైజాగ్ విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్ వరకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలకాలని మర్రాపు సురేష్ పిలుపునిచ్చారు. కావున మన ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గజపతినగరం నుంచి భారీ ఎత్తున జనసందోహంగా విశాఖకు వెళ్లి అధినాయుకుడికి స్వాగతం పలకాలి నిర్ణయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ 15వ తేదీ విశాఖపట్నం జిల్లా జనసేన నాయకులుతో కార్యకర్తలతో సమావేశం అవుతారు. 16వ తేది జనవాణి, జన భరోసా కార్యక్రమంలో ప్రజా సమస్యలు, ప్రజలనుంచి వచ్చే వినతులు స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళం జనసేన నాయకులు, కార్యకర్తలుతో సమావేశం ఉంటుంది. 17వ తేది ఉదయం విలేకరుల సమావేశం అనంతరం ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు శ్రీను, రాము, హరీష్ నాని, మహేష్ పాల్గొన్నారు.