మెగా అభిమానులు అంటే సమాజ సేవకులు: వాసగిరి మణికంఠ

♦️ అమృతవర్షిణి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం.
♦️ శనివారం జరగబోవు “మెగా రక్తదాన శిబిరాన్ని” జయప్రదం చేయండి.
♦️ రక్తదానం చేద్దాం పుణ్యకార్యంలో పునీతులు అవుదాం.
♦️ గుంతకల్ పట్టణ రాష్ట్ర సాయిధరంతేజ యువత అభిమానులు.

గుంతకల్, అన్నపూర్ణేశ్వరి “డొక్కా సీతమ్మ”, “పద్మభూషణ్” డాక్టర్ మెగాస్టార్ కొణిదెల “చిరంజీవి” మరియు జనసేనాని “పవన్ కళ్యాణ్” సేవా స్ఫూర్తితో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గుంతకల్ పట్టణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గుంతకల్ పట్టణం స్థానిక అమృతవర్షిణి బాలుర కళ్యాణ ఆశ్రమం నందు “అన్నదాన వితరణ” కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతరం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మెగా అభిమానులు అంటే సమాజసేవకులు అనే సరికొత్త నిర్వచనాన్ని తెలుపుతూ గుంతకల్ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క మెగా అభిమానికి అభినందనలు తెలిపారు మరీ ముఖ్యంగా రేపు గోపి బ్లడ్ బ్యాంకు నందు జరగబోవు “మెగా రక్తదాన శిబిరాన్ని” ఏర్పాటు చేస్తున్న పవర్ శేఖర్ & టీంకి శుభాభినందనలు తెలిపి పురప్రజలు, మెగా జనసైన్యం సభ్యులు ఈ పుణ్యకార్యాన్ని జయప్రదం చేయాలని ఆయన ప్రత్యేకంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కురుబ పురుషోత్తం, బండి శేఖర్ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, ఆటో రామకృష్ణ, మంజు, అమర్నాథ్, పాపయ్య, ఆటో కృష్ణ, శివ కుమార్, రామకృష్ణ, కొనకొండ్ల శివ, రమేష్ రాజ్, హెచ్ పి సి శేఖర్, ఆటో పాండు, భాష తదితరులు పాల్గొన్నారు.