కొత్తచెరువు మండల జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

పుట్టపర్తి, అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం పట్టణంలో వరదలు ముంచితే చాలా ప్రాంతాలు నీటిమయం అవడం జరిగింది. ఈ కారణంగా గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, పండ్లు జనసేన పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, రాష్ట్ర కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి మరియు జిల్లా నాయకులు అందరూ ప్రజలకు అందజేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు ప్రజలకి ఈ ఇబ్బంది పరిస్థితులలో ఎటువంటి సాయం చేయకపోగా, ప్రజలకు అండగా నిలబడుతున్న జనసేన పార్టీ నాయకులకు ప్రజలలో మంచి పేరు రాకూడదని అదే పనిగా ప్రజలకు సాయం అందకుండా అడ్డుపడడం అమానుషం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన మీరు అండగా ఉండవలసింది పోయి వారికి అందే సాయాన్ని కూడా అందకుండా చేయడం దుర్మార్గం. మీకు ప్రజలు తప్పకుండా తగిన శాస్తి చేస్తారని మేము జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నాము అని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, డి.నరేంద్ర భూపతి, పూల రెడ్డప్ప గూడా మధు, ముత్తా నరేంద్ర, సమ్మిటి నవీన్, సాకే తేజ ప్రదీప్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.