కోడి కత్తి, కోడి కట్టు లాంటి కుతంత్రాలు వైసిపి నాయకులు అలవాటే

  • త్వరలోనే వైసీపీ మంత్రులను గుడ్డలు తీసి కొట్టే రోజులు వస్తాయి
  • 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వైసిపి నాయకులు ఉత్తరాంధ్రకు చేసింది శూన్యం
  • వైసీపీ పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఫైర్

మైలవరం, ఇబ్రహీంపట్నం శనివారం జరిగిన వైజాగ్ సంఘటనలో వైసిపి చర్యలపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల గాంధీ మండిపడ్డారు. ఆదివారం నాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉత్తరాంధ్ర తరపున ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వివిధ పదవుల్లో కొనసాగినవారు ఇప్పుడు వైసీపీ ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. మీరు గతంలో ఉత్తరాంధ్రని అభివృద్ది చేయలేదని ఒప్పుకుంటున్నారా? అని, ప్రజల్ని అమాయకులని చేసి వారిని బలి చేస్తున్నారు. సనివారం జనసేన రాష్ట్ర అద్యక్షులు పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనకు వెళితే మీకు కళ్ళు కుట్టాయి. మీరిచ్చిన గర్జన పిలుపు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది మీరు జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ ని ఏదో ఒక రకంగా అల్లరి చేసి వారి కార్యక్రమాన్ని అపాలనే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఇటువంటి కుళ్ళు, కుతంత్రాలు చేయడంలో నెంబర్ వన్ ఎక్స్పెర్ట్, గతంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీకు మీరే కొట్టించుకుని తలకి గుడ్డ కట్టుకుని రాజకీయం చేశారు. మొన్న మంత్రి పదవి కోసం ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి వెళ్ళి, సీఎం దృష్టిలో పడి మంత్రి పదవి తెచ్చుకున్నారు. ఏదో రకంగా సానుబూతి పొంది పదవులు తెచ్చుకునే అలవాటు జోగి రమేష్ కి ఉంది. గతంలో వైజాగ్ ఇదే ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కోడి కత్తితో పొడిపించుకుని సింపతీ పొందారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా మీరు ప్రవర్తించి రెచ్చగొడితే ప్రతిపక్ష నాయకులు కూడా అదే బాటలో ప్రయాణిస్తారని మండిపడ్డారు. ఈ సమావేశంలో తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, పవన్, నాగబాబు, ప్రవీణ్, వీర మహిళ సుజాత పాల్గొన్నారు.