అక్కల రామమోహన్ రావు (గాంధీ)ని మర్యాదపూర్వకంగా కలిసిన మైలవరం బిజేపి శ్రేణులు
మైలవరం జనసేన అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామమోహన్ రావు (గాంధీ)ని కొండపల్లిలోని వారి స్వగృహములో బీజేపీ మైలవరం ఇంచార్జీ నూతులపాటి బాలకోటేశ్వరరావు మర్యాద పూర్వకముగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా వైజాగ్ లో జరిగిన సంఘటనలపై ఇరువురు ఖండించటం జరిగింది. ప్రజలకోసం పోరాడే నాయకులను కార్యకర్తలను అరెస్టుల పేరుతో భయబ్రాంతులు చేస్తున్నారని, ఇలాంటివి సాగానీయమని, ముందు ముందు ఇలాంటి ఆరాచకాలపై పోరాడతామని ఇరువురు చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమములో, కొండపల్లి మున్సిపాలిటి బిజెపి అధ్యక్ష కార్యదర్శులు చల్లా ఆంజీనేయులు, బొర్రా ప్రవీణ్, బిజెపి కిసాన్ మోర్చా ఐటి సెల్ మారాసు కృష్ణ మోహన్, మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి మాధిరి, వసంత హరి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-16-at-18.50.06.jpeg)