అరెస్టయిన జనసేన నాయకులను, వీర మహిళలను విడుదల చేయాలి: త్యాడ రామకృష్ణారావు(బాలు)

విజయనగరం, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలిపి, ప్రజలకు అండగా నిలిచి, సహాయం చేయటానికి ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వం అప్రజాస్వామికంగా అడ్డుకోవడాన్ని, విజయనగరం జిల్లా నుండి విశాఖపట్నం జనవాణీ కార్యక్రమానికి వెళ్తున్న జనసేన నాయకులను, వీరమహిళలను ఇంటివద్దనే నిర్భందించడం, అరెస్టులు చేయడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలనుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ ఈ చులకన రాజకీయాలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి చేస్తుందని, పోలీసులపైన, చట్టాలపైన జనసేనకు అపారమైన గౌరవం ఉందని, ప్రభుత్వము ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. అరెస్టయిన జనసేన నాయకులను, వీరమహిళలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.